బండి సంజయ్​ నేరాన్ని ఒప్పకున్నారు: వరంగల్​ సీపీ రంగనాథ్​

బండి సంజయ్​ నేరాన్ని ఒప్పకున్నారు: వరంగల్​ సీపీ రంగనాథ్​

 టెన్త్​ పేపర్​ లీక్​ కేసులో  బండి సంజయ్​ నేరాన్ని ఒప్పకున్నారని  వరంగల్​ సీపీ రంగనాథ్​ చెప్పారు. టెన్త్​ హిందీ పేపర్​ను ప్రశాంత్​ వైరల్​ చేశాడని  చెప్పారు.    మాల్​ప్రాక్టీస్​ కింద కేసు నమోదు చేశామన్నారు.  ప్రశాంత్​, మహేశ్​ ప్రశ్న పత్రాన్ని బండి సంజయ్​కి పంపారు. ఆయనకు ఉదయం 11.24 గంటలకు ప్రశ్నప్రతం చేరింది.

ఏ 2 ప్రశాంత్​ ఎమ్మెల్యే ఈటలకు 10.41 గంటలకు పంపాడు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారు. అరెస్టు సమయంలో బండి సంజయ్​ తన దగ్గర ఫోన్​లేదన్నారు.    పేపర్​ లీక్​ కేసులో మరికొందరు కీలక సాక్షులను ప్రశ్నించాల్సి ఉంది. అనవసరంగా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశం మాకు లేదు. బండి సంజయ్​ అరెస్టుపై లోక్​సభ స్పీకరుకు సమాచారం ఇచ్చామన్నారు.