రెండవ రోజు కొనసాగిన సిట్ విచారణ

రెండవ రోజు కొనసాగిన సిట్ విచారణ

ముద్ర, మల్యాల: TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంపై సిట్ అధికారుల విచారణ ఇంకా కొనసాగుతోంది. బుధవారం కూడా మల్యాల మండలంలో సిట్ బృందం పర్యటించి, పలువురు అభ్యర్థులను విచారించారు. విచారణలో అందిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సిట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు, మొత్తం మండలంలో 40 కి పైగా అభ్యర్థులను అనుమానిస్తూ, విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణ శుక్రవారం కూడా కొనసాగవచ్చని సమాచారం.