మృతురాలు కుటుంబానికి ప్రభాకర్ గౌడ్ పరామర్శ..

మృతురాలు కుటుంబానికి ప్రభాకర్ గౌడ్ పరామర్శ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ గౌడసంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి గోపి మాతృమూర్తి ఈశ్వరమ్మ(70) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందింది. కాగా విషయం తెలుసుకున్న తెలంగాణ గౌడసంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు తడుక సుధాకర్ గౌడ్, జిల్లా ప్రధానకార్యదర్శి బుర్ర రమేష్ గౌడ్ లు హన్మకొండకు వెళ్లి ఈశ్వరమ్మ పార్థివ దేహానికి పుష్పగుచ్ఛం వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మాతృమూర్తిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న, సోదర సమానుడు గోపికి అన్నివిధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.