హాస్పిటల్ లో సోలార్ ప్లాంట్, ఆంబులెన్స్ ప్రారంభించిన మంత్రి..

హాస్పిటల్ లో సోలార్ ప్లాంట్, ఆంబులెన్స్ ప్రారంభించిన మంత్రి..

ముద్ర ప్రతినిధి జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ హాస్పిటల్ లో శనివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేతులమీదుగా సోలార్ ప్లాంట్, అంబులెన్స్ లను ప్రారంభించారు. హాస్పిటల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.