సిఎం కేసిఆర్ ప్రత్యేక చొరవ వల్లే

సిఎం కేసిఆర్ ప్రత్యేక చొరవ వల్లే
  • తెలంగాణ గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామా లాగా నిలుస్తున్నాయి*
  • ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచ్ సెక్రెటరీ లకు సన్మానం
  • జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: సిఎం కేసిఆర్ ప్రత్యేక చొరవ వల్లే తెలంగాణ గ్రామాలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామా లాగా నిలుస్తున్నాయనీ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు.

శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2023 క్రింద జిల్లా స్థాయిలో మూడు కేటగిరీలలో ఎంపికైన 15 ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచ్ లు , సెక్రెటరీ లను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి ఘనంగా సన్మానించారు.

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ....
స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవతో నే జిల్లాలోని గ్రామాలు అభివృద్ధి బాట పట్టి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు చేజిక్కించుకుంటున్నాయన్నారు.పల్లెలు దేశానికే పట్టుగొమ్మలు అని తెలంగాణ పల్లెలు నిరూపించాయన్నారు. ఏ గ్రామ పంచాయితీ లో కూడా సెక్రెటరీ లేకుండా ఉండాలని సిఎం కేసిఆర్ నిర్ణయం తీసుకుని ప్రతి గ్రామ పంచాయితీ కి సెక్రెటరీ నీ నియమించారని అన్నారు. ఇప్పుడు ఏ పల్లె చూసిన పచ్చదనం , పరిశుభ్రత తో అలరాలుతున్నాయంటే సిఎం కేసిఆర్ వల్లే సాధ్యమైందన్నారు. సిఎం కేసిఆర్ ప్రత్యేక చొరవ తో ఇవ్వాలా తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ....రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం ఉండాలని సిఎం కేసిఆర్ తెలంగాణకు హరితాహరం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తో పాటు స్వచ్చమైన రక్షిత త్రాగునీరు అందివ్వాలని సిఎం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.

ప్రభుత్వ తీసుకున్న చర్యలతో తెలంగాణ పల్లెలు పరిశుభ్రత, పచ్చదనం విషయంలో దేశానికే ఆదర్శంగా, నమూనాగా ఉన్నాయని తెలిపారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం లో భాగస్వామ్యులైన స్థానిక ప్రజా ప్రతినిధులు, సెక్రెటరీ లకు అభినందనలు తెలిపారు. దేశం, రాష్ట్రం బాగుంటుందని సిఎం కేసిఆర్, పంచాయితీ రాజ్ మినిష్టర్, మంత్రి కే టి ఆర్ లు నమ్మి పల్లెల బాగుకోసం కష్టపడ్డారనీ చెప్పారు. గ్రామానికో ట్రాలీ, ట్రాక్టర్, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డు లను ఏర్పాటు చేశారని అన్నారు.

గంగదేవి పల్లె అయిందన్నారు..
జిల్లాలో 255 గ్రామ పంచాయితీ లు బాగా పని చేస్తున్నాయని అన్నారు. రాష్ర్టంలో 7 శాతం పచ్చదనం పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. 2018 సంవత్సరంలో తెచ్చిన నూతన పంచాయితీ చట్టం కూడా పల్లెల అభివృద్ధికి దోహదం చేసిందన్నారు. స్వచ్చత హి సేవా కార్యక్రమం లో కూడా జిల్లా పంచాయితీ లు ముందు వరుసలో నిలపాలనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో డీపీవో రవీందర్, డీఆర్డీవో నక్క శ్రీనివాస్ , స్వచ్ఛ భారత్ మిషన్ బాధ్యులు సురేష్, ఎంపీపీ లు, జెడ్పీటీసీ లు, ఎంపిడివో లు, ఎంపీఓ లు తదితరులు పాల్గొన్నారు.