సాంస్కృతిక రంగంలో జాతీయస్థాయికి - ఏకలవ్య గురుకుల విద్యార్థులు
![సాంస్కృతిక రంగంలో జాతీయస్థాయికి - ఏకలవ్య గురుకుల విద్యార్థులు](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_6506917047782.jpg)
ముద్ర,ఎల్లారెడ్డిపేట : వివిధ సాంస్కృతిక రంగాలలో జాతీయ స్థాయికి ఏకలవ్య గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకుల మోడల్ రెసిడెన్షియల్ లో ఈ ఎన్ ఆర్ ఎస్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి సాంస్కృతిక వేడుకలలో విద్యార్థులు తమ విభిన్న ప్రదర్శనలతో ప్రతిభను చటారు. ఉపన్యాసం, చిత్రలేఖనం, అనర్గాళ భాష, సామూహిక, సాంఘిక,సాహిత్య, నృత్య రంగాలలో ఉన్నతమైన ప్రతిభను ప్రతిబింబించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.