వైస్ ఎంపీపీ పిల్లలపై 5,00,000 రూ..లు ఫిక్స్ డిపాజిట్ | Mudra News

వైస్ ఎంపీపీ పిల్లలపై 5,00,000 రూ..లు ఫిక్స్ డిపాజిట్ | Mudra News

ముద్ర, ఎల్లారెడ్దిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ హేమ భర్త దేవేందర్ గత మాసంలో గుండెపోటుతో మరణించాడు. తమ కుటుంబాన్ని పది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించి వారి ఇద్దరి పిల్లలపై ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పత్రాలను గురువారం జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వైస్ ఎంపీపీ హేమకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొర్రె కరుణ, జెడ్ పి టి సి  గుగులోత్ కళావతి, మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.