భూపాలపల్లిలో వైఎస్సార్ జయంతి వేడుకలు..

భూపాలపల్లిలో వైఎస్సార్ జయంతి వేడుకలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి టిపీసీసీ సభ్యుడు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి వైఎస్ఆర్ చేసిన సేవలపై ఈ సందర్భంగా సత్యనారాయణరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యుడు చల్లూరి మధు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, ముఖ్య నాయకులు అంబాల శ్రీనివాస్, మందల రాజిరెడ్డి, ఉడుత మహేందర్, తోట రంజిత్, నగునూరి రజినీ కాంత్, పానుగంటి శ్రీనివాస్, వెంకీ యాదవ్, కిషోర్ రెడ్డి, బేంబడి సురేష్, చుంచుల మహేష్, నరేష్, చారి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.