ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి ఉత్సవాలు

ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి ఉత్సవాలు

ముద్ర, జమ్మికుంట: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమల్ల సంపత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కనుమల్ల సంపత్ మాట్లాడుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని 2004లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చేసి పాదయాత్ర సమయంలో ప్రజల కార్మికులు కర్షకులు బాధలు తెలుసుకునారు. రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు రుణమాఫీ ఆరోగ్యశ్రీ 108 పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని చేసి ప్రజల మన్ననలు పొందారు గొప్ప నాయకున్ని కూలిపోవడం బాధాకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో శనిగరపు మేరీ రామ్, మేకల సురేష్,కళ్లెం తిరుపతిరెడ్డి, గుండారపు సాయి, పెద్ది శివ, భోగం సాయి, ధార లక్ష్మణ్, గూడెపు ఓదెలు,మహమ్మద్ అజ్గర్ తదితరులు పాల్గొన్నారు.