బిజిగిర్ షరీఫ్ దర్గాను దర్శించుకున్న ఈటల

బిజిగిర్ షరీఫ్ దర్గాను దర్శించుకున్న ఈటల

ముద్ర, జమ్మికుంట:-జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకేషాప్అలీ దర్గా ఉర్సు ఉత్సవాల భాగంగా ఆదివారం రోజున హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ ఈటల రాజేందర్ కి శాలువాతో సన్మానం చేసినది. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్,దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, దర్గా కమిటీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌపిక్ హుస్సేన్, దర్గా కమిటీ కార్యదర్శి మహమ్మద్ జమాల్ అష్రఫ్, దర్గా కమిటీ కోశాధికారి మొహమ్మద్ మహమూద్, దర్గా కమిటీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ నయముద్దీన్, సభ్యులు అహమ్మద్, లతీఫ్ హుస్సేన్ ఆజమ్, జలీల్, హైదర్ ,తాజ్ తదితరులు పాల్గొన్నారు.