బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి గంగుల

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చేరికలపై దృష్టి సారించారు. ఈరోజు ఉదయం కరీంనగర్ మీ సేవా కార్యాలయంలో బీజేపీ, కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో పలువురు ముఖ్య నాయకులు చేరారు.

నాగుల మల్యాల సర్పంచ్ నాయిని ప్రసాద్, కమాన్ పూర్ మాజీ సర్పంచ్ బోనాల మురళి మనోహర్, మల్కాపూర్ మాజీ ఎంపిటిసి బొమ్మ ఈశ్వర్ గౌడ్ లను మంత్రి గంగుల కమలాకర్ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు పలువురు వార్డు మెంబర్లు, వందలాది మంది కార్యకర్తలు బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.