అనుచిత పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి

అనుచిత పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్  పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి, ఫోటోతో పోస్ట్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు కరీంనగర్ టూ టౌన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్ పేరిట ఎంపీ బండి సంజయ్ కుమార్ పై అనుచితంగా  సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమాచారం , అందుకు సంబంధించిన పూర్తి వివరాలను జత చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు సోషల్ మీడియా వేదికగా బి ఆర్ ఎస్ చిల్లర రాజకీయం చేస్తుందని, వ్యక్తులను కించపరిచే విధంగా దూషణలతో  పోస్టులు పెట్టడం మంచి సంస్కృతి కాదన్నారు. బండి సంజయ్ కుమార్ ను రాజకీయంగా ఎదుర్కోలేక బిఆర్ఎస్ కనుసనల్లో పనిచేసే కొంతమంది వ్యక్తులు పని గట్టుకొని ఇలాంటి పనికిమాలిన వ్యవహారాలు చేస్తున్నారని, అలాంటి వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. కొలగాని శ్రీనివాస్, రమణారెడ్డి, అవుదుర్తి శ్రీనివాస్ కటకం లోకేష్ ఉలిగే సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.