పోకల శివకుమార్ కు సన్మానం

పోకల శివకుమార్ కు సన్మానం

ముద్ర, రఘునాథపల్లి: శ్రీవిజయ దుర్గ ఆలయ నిర్మాణం కోసం కష్టపడి పనిచేసిన వైశ్య సంఘం స్థానిక సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్ గుప్తాను మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కూరెల్లి పెద్ద ఉపేందర్ మాట్లాడుతూ పోకల శివకుమార్ దుర్గామాత ఆలయ నిర్మాణానికి చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో రఘునాథపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు శంశెట్టి శంకరయ్య, కార్యదర్శి పడకంటి రవీందర్, కోశాధికారి మొగిళ్లపల్లి నాగరాజు, బిల్దే నాగన్న, బిల్దే శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.