ఆంజనేయ స్వామి కి అభిషేకం చేసిన మంత్రి, ఎంపీ

ఆంజనేయ స్వామి కి అభిషేకం చేసిన మంత్రి, ఎంపీ
  • క్యాంపు కార్యాలయంలో హనుమాన్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన మంత్రి
  • కోమటి చెరువు వద్ద హనుమాన్ తెప్పోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట: ముద్ర ప్రతినిధి: రామభక్త హనుమాన్ సేవలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తరించారు. కోమటి చెరువులో నిర్వహించిన హనుమాన్ తెప్పోత్సవంలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ఆంజనేయ స్వామికి నిర్వహించిన అభిషేకంలో పాల్గొన్నారు .సిద్దిపేట పరిధిలో హనుమత్ మాల వేసుకున్న దీక్షదారులందరికీ తన కార్యాలయం వద్ద భిక్షను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వాములకు పండ్లు ప్రసాదాన్ని అందజేశారు, అంజన్నకు నిర్వహించిన అభిషేక అర్చన కార్యక్రమాల్లో మంత్రితోపాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొనగా శనివారం రాత్రి కోమటి చెరువులో జరిగిన ఆంజనేయ స్వామి తెప్పోత్సవంలో అఖిలభారత అనుమతిక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ పాల్గొన్నారు. సిద్దిపేటలోని మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయం ఆదివారం నాడంత హనుమాన్ స్వాములతో సందడిగా మారింది. హనుమాన్ దీక్ష మాలధారణ స్వాముల భజన, స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.