కొండగట్టు లో అధికారుల నిర్లక్ష్యం...

కొండగట్టు లో అధికారుల నిర్లక్ష్యం...

ముద్ర, మల్యాల: మల్యాల మండలంలో ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున గాలి దుమారం లేచింది. దాంతో అక్కడక్కడా చెట్లు నెలకోరగ్గా, కొండగట్టు అంజన్న క్షేత్రంలో చలువ పందిరి కూలింది. ఆలయం ముందు భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన చలువ పందిరి కూలినప్పటికి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రాత్రి సమయంలో భక్తులు ఇబ్బంది పడ్డారు. అలాగే ప్రసాదం కౌంటర్ ముందే ముసివేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు.