12 న సిద్దిపేటలో తెలంగాణ రన్

12 న సిద్దిపేటలో తెలంగాణ రన్

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ( 12 న)నాడు ఉదయం 5:30 గంటలకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో తెలంగాణ రన్ నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. మంత్రి తన్నీరు హరీష్ రావు ,స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ రన్ ప్రారంభిస్తారని తెలిపారు.మహిళలు, యువకులు,విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.