గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కు జిల్లాలో 20 సెంటర్లు 

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కు జిల్లాలో 20 సెంటర్లు 

పకడ్బందీ ఏర్పాట్లతో పరీక్షలు జరపాలి

సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్


ముద్ర  ప్రతినిధి: సిద్దిపేట  గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్ష నిర్వహణకు  పగడ్బందిగా ఎర్పాట్లు చేయ్యాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలోని సమావేశ మందిరంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరిక్ష నిర్వహణ గూర్చి పరీక్ష సెంటర్ల చీప్ సూపరిండెంట్లు, లైజన్ ఆపిసర్స్, రూట్ ఆపిసర్స్, ప్లైయుంగ్ స్వ్కాడ్ అధికారులు తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 11వ తేది ఆదివారం రోజున ఉదయం 10:30 గంటల నుండి మద్యాహ్నం 1 వరకు నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జిల్లాలో 20 సెంటర్ల లో 7786 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు.  టిఎస్పిఎస్సి బోర్డు వెలువరించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కటి చదువుతు అధికారులకు వివరించారు. ప్రతి అధికారి పరీక్ష నిర్వహణ రోజు, ముందురోజు ఏం చెయ్యాలి? ఏలా నిర్వహించాలి? అనేక  విషయాల గుర్చి దిశానిర్దేశం చేశారు. 
 

పరీక్ష సెంటర్ల లో ప్రతి గదిని చెక్ చెయ్యాలని ఆదేశించారు. గదులలో పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యవంతంగా కూర్చునేలా ఫర్నిచర్, లైట్లు, ఫ్యాన్లు అన్ని ఉండేలా చూడాలని. అభ్యర్థుల సిట్టింగ్ ఆరెంజ్ మెంట్ జాగ్రత్తగా చెయ్యాలనిఆదేశించారు. సిసి కెమెరాలు సెంటర్ మొత్తం లేదా కనీసం చీప్ సూపరిండెంట్ రూంలో అయున తప్పనిసరిగా ఉండాలనిసూచించారు.  ఏ ఓక్క సిబ్బంది దగ్గర మొబైల్ పోన్, ఎలక్ట్రానిక్ గడియారం ఉండకుండా చూసుకోవాలనిసూచించారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుండి బయట చెకింగ్, బయోమెట్రిక్ అయిన తర్వాతనే లోనికి పంపాలని ఎట్టి పరిస్థితుల్లో 10:15 కి గెట్ మూసివేయాల న్నారు.వికలాంగుల కోసం స్క్రైబ్ లను అందుబాటులో ఉంచుకోవాలని. ఓక రోజు ముందే అన్ని పనులు పూర్తి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ,డిఎఓ శివప్రసాద్, కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.