తోడేళ్ల దాడిలో గొర్రెలు మృతి

తోడేళ్ల దాడిలో గొర్రెలు మృతి

సిద్దిపేట ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామంచ గ్రామంలోని ఎడ్ల వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన గొర్రెల మందపై గత రాత్రి తోడేలు దాడి చేయడంతో 10 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. బాధిత రైతు ఫిర్యాదు మేరకు మండల పశువైద్యాధికారి స్వాతి, గ్రామ సర్పంచ్ సంతోషి ,స్థానిక అధికారులు గొర్రెల కొట్టాన్ని సందర్శించి చనిపోయిన గొర్రెలను పరిశీలించారు. ప్రభుత్వము నుంచి ఆర్థిక సాయం అందేలా చూడాలని రైతు అధికారులకు విజ్ఞప్తి చేశారు.