ఇంటర్లో 65 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
![ఇంటర్లో 65 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6459ecbc65b92.jpg)
గతేడాది కంటే మూడు శాతం తక్కువ
సిద్దిపేట :ముద్ర ప్రతినిధి: ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలబడ్డాయి. సిద్దిపేట జిల్లా నుంచి 65 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.గత సంవత్సరం 68 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఈ సంవత్సరం మరో మూడు శాతం తగ్గి 65 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. జిల్లా నుంచి 10505 మంది బాలురు పరీక్షలు రాయగా 4722 పాసయ్యారు 11255 మంది బాలికలు పరీక్షలు రాయగా 7559 పాసయ్యారు. గ తేడాది 68 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా ఈ సంవత్సరం 65 శాతం మంది విద్యార్థులు పాసయ్యారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సూర్యప్రకాష్ తెలిపారు.