విధుల్లో చేరిన 20 మంది జెపిఎస్, 25 మంది ఓపిఎస్ లు

విధుల్లో చేరిన 20 మంది జెపిఎస్, 25 మంది ఓపిఎస్ లు

ముద్ర ప్రతినిధి, మెదక్: రెగ్యులరైజ్ కోసం సమ్మె చేస్తుండగా.... ప్రభుత్వ అలంటిమేటంతో మంగళవారం సాయంత్రం వరకు మెదక్ జిల్లాలో 322 మంది ఉండగా కేవలం 20 మంది విధుల్లో చేరినట్లు జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తెలిపారు. ఇంకా 302 మంది. సమ్మెలో ఉన్నారు. కాగా 46 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుండగా 25 మంది విధులలో చేరారు. మరో 21 మంది సమ్మెలో ఉన్నారని ఆయన తెలిపారు. .విధులలో చేరని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డిపిఓ సాయిబాబా హెచ్చరించారు.