జాబ్ మేళాకు విశేష స్పందన

జాబ్ మేళాకు విశేష స్పందన

దుబ్బాక, ముద్ర : సిద్దిపేట జిల్లా దుబ్బాక లో శనివారం నాడు కె ఆర్ ఆర్ గార్డెన్ లో సింధు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి, యువకులు తరలివచ్చారు.జాబ్ మేళా లో వివిధ బ్యాంకులు, ఫైనాన్స్, సెక్యూరిటీ సంస్థలు, నిరుద్యోగ యువత నుండి బయోడేటా ఫారాలు,మెమోలు తీసుకొని పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించి కొందరికి జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ జాబ్ మేళాను ఉద్దేశించి దుబ్బాక ఎమ్మెల్యే ఎం. రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాక పేరును విశ్వనగరంలో మారుమ్రోగించిన ఘనత జీనుప్యాంట్, రబ్బర్ చెప్పుల యువతదేనన్నారు.

తన గెలుపు నాకు సహకరించిన వారిని వారి కాళ్ళ మీద నిలబెట్టడమే తన లక్ష్యమన్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకే వారి మాటలు ఎవ్వరూ పట్టించుకో వద్దన్నారు. 500 రూపాయలతో సిద్దిపేటలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నని చెప్పారు. యువత కూడా అలాగే ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. జాబ్ మేళాలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మొదటి అడుగు వేయండని ఆయన చెప్పారు. 

దుబ్బాక నియోజకవర్గంలో నిరుద్యోగాన్ని  ప్రారదోలడమే తన లక్ష్యమన్నారు   నియోజకవర్గ ప్రజలకు తన శరీరంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు ప్రభుత్వం తో కొట్లాడుతనాని చెప్పారు.ఈ కార్యక్రమంలో సింధు భారతి ఫౌండేషన్ నిర్వాహకులు, బిజెపి రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్ గౌడ్,కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, బిజెపి నాయకులు కిష్టoగారి సుభాష్ రెడ్డి, ఎస్ ఎన్ చారి, తదితర నాయకులు పాల్గొన్నారు.