రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం 600 ఖాళీ గోనె సంచులు దగ్ధం

రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం 600 ఖాళీ గోనె సంచులు దగ్ధం

 సిద్దిపేట : ముద్ర ప్రతినిధి  సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపురం గ్రామంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో విజయలక్ష్మి రైస్ ఇండస్ట్రీలో సుమారు 600   ఖాళీ గోనె సంచులు దగ్ధమయ్యాయి.
ప్రమాద విషయం తెలియగానే రాంపురానికి చెందిన మంచినీటి ట్యాంకర్ తో పాటు సిద్దిపేట అగ్ని మాపక కేంద్రం నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది.
దాదాపుగా లక్షల్లో నష్టం వాటిల్లినట్లు రైస్ మిల్ యజమాని తెలిపారు