గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతం

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతం
  • పరీక్షకు 68.92 శాతం అభ్యర్థులు హాజరు
  • కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, సిపి

ముద్ర ప్రతినిధి :  సిద్దిపేట:  జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తెలిపారు.ఆదివారం నాడు సిద్దిపేట పట్టణంలోని 20 కేంద్రాలలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఉదయం స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్ష కేంద్రాలకు పరీక్ష పేపర్లను తరలించడంతోపాటు పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షా తీరును జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించామని అన్నారు.

జిల్లాలో 20 కేంద్రాలలో  7,786 మంది అభ్యర్థులను పరీక్ష రాసేందుకు టీఎస్పీఎస్సీ కేటాయించగా 5,366 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 2,420 గైర్ హాజరై అయ్యారు.పరీక్షకు 68.92 శాతం హాజరయ్యారని తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో  పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, పర్యవేక్షించారు. పోలీస్ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.