మూడు గ్రామాల్లో  బిఆర్ఎస్వి కమిటీల ఏర్పాటు

మూడు గ్రామాల్లో  బిఆర్ఎస్వి కమిటీల ఏర్పాటు

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట : సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాల్లోని మూడు గ్రామాల్లో మంగళవారం బిఆర్ఎస్వి గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు స్థానిక నేతల సమక్షంలో కొత్త కమిటీలను వేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాల విషయం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయా గ్రామాల్లో విద్యార్థులకు బిఆర్ఎస్వి నాయకులు వివరించారు.

సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్పాలా(బొగ్గులోని బండ ), సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి, నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామాలలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాల్లో  బిఆర్ఎస్వి నియోజకవర్గం అధ్యక్షుడు శ్యామ్ యాదవ్, మండలాల అధ్యక్షులు కోడెల నరేష్ యాదవ్, బండి శ్రీకాంత్ ఆకుల సతీష్, ఆయా గ్రామాల సర్పంచులు పురుమాండ్ల శ్యాంసుందర్ రెడ్డి, రగోత్తమ రెడ్డి, పరశురాములు, సిద్దిపేట రూరల్ జెడ్పిటిసి శ్రీహరి గౌడ్ రూరల్ పార్టీ అధ్యక్షుడు ఎర్ర యాదయ్య నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్ మండల నాయకులు బాల్రెడ్డి, భాను, ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు