అదనపు కలెక్టర్‌‌ను కలిసిన టీజీవోలు

అదనపు కలెక్టర్‌‌ను కలిసిన టీజీవోలు

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రోహిత్ సింగ్‌ను తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీజీవో) జిల్లా అధ్యక్షుడు అంజద్ అలీ, ప్రధాన కార్యదర్శి కొర్నిలియస్, ఇతర కమిటీ సభ్యులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోహిత్ సింగ్‌కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌‌డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ రామిరెడ్డి, డీటీవో నరసింహారెడ్డి, సీపీవో ఇస్మాయిల్, డీఎస్‌వో రోజా రాణి, డీడబ్ల్యూవో జయంతి, ఎక్సైజ్ శాఖ అధికారిణి కృష్ణప్రియ, డీఈవో రాము, ఉపాధి కల్పన అధికారిణి ఉమారాణి, జీఎం ఇండస్ట్రీస్ రమేశ్‌ కుమార్, డీఐఈవో శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ అధికారి రవీందర్, చేనేత శాఖ ఏడీ చౌడేశ్వరి, జైపాల్ రెడ్డి, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.