కేసీఆర్ పేరుతోనే ఓట్లు
- మా ముఖం చూస్తే ఒక్క ఓటు రాదు
- మంత్రి ఎర్రబెల్లి హాట్ కాంమెట్స్
ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదసభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచన వ్యాఖ్యలు చేశారు. పొన్నాల లక్ష్మయ్య, పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడిన అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ తాము ఎంత అభివృద్ది చేసినా, ప్రజలకు సేవ చేసినా.. సీఎం కేసీఆర్ పేరుతోనే ఓట్లు పడతాయన్నారు. ఇదే క్రమంలో తమ ముఖం చూస్తే ఒక్క ఓటు రాదంటూ వ్యాఖ్యానించారు. దీంతో వేదికపై ఉన్న పలువురు నాయకులతో పాటు సభకు విచ్చేసిన ఆయా వర్గాల ప్రజలు గుసగుసలాడుకోవడం కనిపించింది. సభ వేదికపై ఉండి అందరిని సమన్వయం చేస్తున్న మంత్రి చేసిన ఈ కాంమెట్స్ చర్చకు దారితీసాయి.