2న కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ ఆన్లైన్ క్విజ్
![2న కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ ఆన్లైన్ క్విజ్](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_649aec462bdfe.jpg)
ముద్ర ప్రతినిధి, జనగామ: జులై 2న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే రాజీవ్గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీల్లో యువతీ యువకులు పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని కాంగ్రెస్ జనగామ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కోరారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని యువత క్విజ్ పోటీలో పాల్గొనేందుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
కార్యక్రమం లో ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకుడు చింత కింది మల్లేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మాజీద్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుల్తాన్ గోవింద్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు సౌడ మహేష్, ఎండీ ఫయాజ్, పులిగిల్ల శివ, ఎండీ ఆజమ్, బెజడి హరీష్ పాల్గొన్నారు.