ఎస్సై వీరేందర్‌‌ సస్పెండ్‌

ఎస్సై వీరేందర్‌‌ సస్పెండ్‌

ముద్ర ప్రతినిధి, జనగామ (రఘునాథపల్లి) : వ్యవసాయ భూమి వివాదంలో నిందితుడికి సహకరించిన ఎస్సై ఎన్‌.వీరేందర్‌‌ను సస్పెండ్‌ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరేందర్‌‌ రఘునాథపల్లి ఎస్సైగా పనిచేసిన ఓ భూవివాదంతో పోలీస్ కమిషనరేట్ వీఆర్ కు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి అధికారులు నిర్వహించిన విచారణకు ఎస్సై సహకరించకపోవడంతో పాటు నిందితుడికి సహకరించి, బాధితుల్ని ఇబ్బందులు గురి చేసినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో ఎస్సై వీరేందర్ ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.