బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు: మంద కృష్ణ మాదిగ

బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు: మంద కృష్ణ మాదిగ

ముద్ర, మల్యాల : మాదిగలను మోసం చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటు వేయొదని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం మల్యాల మండలంలో చొప్పదండి బీజేపీ అభ్యర్థి బొడిగా శోభ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందకృష్ణ హాజరై మాట్లాడారు. తమ వర్గానికి చెంది బిడ్డను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పెన్షన్, ఆరోగ్యశ్రీ పథకం వంటి అనేక అంశాలపై పోరాటం చేసినట్లు తెలిపారు. 30 యేళ్లుగా ఒకే జెండా కింద పని చేస్తూ పోరాడానని, వర్గీకరణ కోసం ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించు కోలేదని తెలిపారు.

మాదిగ జాతి బిడ్డల భవిష్యత్ కోసం పోరాటం చేశానని, గత పాలకులు మనల్ని విస్మరించారని గుర్తుచేశారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ మన కోసం వచ్చి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని, ఇందుకోసం కమిటీ వేస్తున్నామని ప్రకటించారని గుర్తుచేశారు. మాట ఇచ్చి నిలబెట్టుకునే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ఉద్యమ సమయంలో అండగా నిలిచిన తనను కేసీఆర్ సీఎం అయ్యాక రెండుసార్లు జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ బిడ్డ లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​కు  ఓటేయొద్దని అన్నివర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శోభను భారీ మెజార్టీతో గెలిపించాలని, కమలం పువ్వుగుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రావణ్, సురేశ్, గంగాధర్, ప్రసాద్, రాములు, వెంకటస్వామి, మల్లేశం, రుత్త కిషన్, రాజు, గౌతం రాజు, రాజేశం, రాఘవేంద్ర తదితులున్నారు.