పెంబర్తి స్కూల్ను సందర్శించిన ఎన్ఎస్యూఐ
ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లా పెంబర్తిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు శనివారం ఎన్ఎస్యూఐ లీడర్లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు చిలువేరు అభి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ చేపడుతున్న ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం వల్ల పిల్లలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు.
పెంబర్తి స్కూల్లో ఆడ పిల్లల బాత్ రూమ్స్ కి డోర్లు, తిన్న ప్లేట్లు కడుక్కోవడానికి నల్లాలు లేవన్నారు. కనీస సౌకర్యాలు అందించని కాంట్రాక్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు శిరీష, -అరవింద్ రెడ్డి, గోపిచంద్, సృజన్, వినయ్, కిరణ్, అరుణ్ పాల్గొన్నారు.