ఘనంగా కడియం జన్మదిన వేడుకలు

ఘనంగా కడియం జన్మదిన వేడుకలు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి 73 వ జన్మదిన వేడుకలు శనివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్,  చిల్పూర్ మండలాల్లో ఘనంగా జరిగాయి. స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుండి వివేకానంద సెంటర్, శివాజీ సెంటర్, గాంధీ చౌరస్తా, బస్టాండ్ మీదుగా అభిమానులు నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మహా అన్నదానం చేశారు. కార్యక్రమంలో బెలిదె వెంకన్న, చింత కుంట్ల నరేందర్ రెడ్డి, బుర్ల శంకర్, సింగపురం జగన్, రాపోలు మధుసూదన్ రెడ్డి, పోగుల సారంగపాణి, పురమని రజాక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


చిల్పూర్ మండల కేంద్రంలో స్థానిక గ్రామపంచాయతీ నుండి వరలక్ష్మి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కడియం శ్రీహరి జన్మదిన కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి, సర్పంచులు రాజ్ కుమార్, రూప్ల నాయక్, రవీందర్, శ్యాం కుమార్ రెడ్డి, బాలరాజు, సమ్మయ్య, జనగాం యాదగిరి, తాళ్లపల్లి సంపత్, బాపురెడ్డి, సాధన నర్సింహులు, భూక్య సుధాకర్, ఎర్రబెల్లి చేరాలు, రజిత, జక్కుల రాజయ్య తదితరులు పాల్గొని కడియం జన్మదిన వేడుకలను ఘనంగా  నిర్వహించారు.