గిట్టుబాటు ధర పొందండి ... ఎమ్మెల్యే రాజయ్య

గిట్టుబాటు ధర పొందండి ... ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరను పొందాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య రైతులను కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లిలో సెర్ఫ్, డిఆర్డిఏ, ఐకెపి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులు తాలు లేకుండా, తేమశాతం తక్కువగా నాణ్యతతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు లభిస్తుందన్నారు. అకాల వర్షాలు కురుస్తున్న తరుణంలో రైతులు జాగ్రత్తలు పాటించి ధాన్యం తడవకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సర్పంచ్ గోవిందు ఆనందం, ఎంపీటీసీ బెల్లపు వెంకటస్వామి, ఉప సర్పంచ్ మహేందర్, ఏపీఎం కవిత, మాజీ సర్పంచ్ బూరు నరేందర్, గట్టయ్య, ప్రతిభ, మహాలక్ష్మి మహిళా సంఘాల సభ్యులు నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు