దుర్గామాత గుడికి వైస్ ఎంపీపీ విరాళం

దుర్గామాత గుడికి వైస్ ఎంపీపీ విరాళం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ లోని దుర్గామాత ఆలయానికి మండల వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి రూ.10 వేలు విరాళంగా ఇచ్చారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా శుక్రవారం సరస్వతి అమ్మవారి అలంకరణలో దర్శనమిచ్చారు. పంచామృత అభిషేకం, నిత్య హోమం, నిత్య పూర్ణాహుతి, కార్యక్రమంలో పాల్గొన్న మండల వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి ఆలయ అభివృద్ధికి విరాళాన్ని ఆలయ ధర్మకర్తల కమిటీ కి అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఉమ్మాగొని రమ - రాజు, గౌడ సంఘం అధ్యక్షుడు బొంగోని యాదగిరి దీక్ష సభ్యులు పండుగ రాజేశ్వర్, పండుగ బుచ్చయ్య, పర్ష రాజు, పండుగ కనుకయ్య, పండుగ రవి, పండుగ సత్తయ్య, పండుగ ఉప్పలయ్య, అక్కనపల్లి రాములు, దామేర రాంబాబు పోలు వికాస్, యూత్ నాయకులు పొన్నం రఘు, అక్కనపల్లి రాజు, మహిళలు, శ్రీ సీతా రామ చంద్ర స్వామీ ఆలయ అర్చకులు జీడికంటి వరుణచార్యులు తదితరులు పాల్గొన్నారు.