పేదలందరికీ ‘డబుల్‌’ ఇండ్లు ఇవ్వాలి

పేదలందరికీ ‘డబుల్‌’ ఇండ్లు ఇవ్వాలి

 బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కోసం సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదలకు ఇండ్లు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూసేందుకు వెళితే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ హైకాండ్‌ పిలుపు మేరకు పేదల ఇండ్ల కోసం ఈ నెల 25న ఇందిరా పార్కు వద్ద కిషన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు లీడర్లు పాల్గొన్నారు.