చెకింగ్.. చెకింగ్..!
ముద్ర ప్రతినిధి, జనగామ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనగామ జిల్లా సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం పెంబర్తి చెక్ పోస్టు వద్ద ఏసీపీ దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేశారు. అదే సమయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఆయన సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎస్సై సృజన్, పోలీసు సిబ్బంది, బీఎస్ఎఫ్ జవాన్లు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.