తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి

తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి

ముద్ర,జఫర్‌గడ్:  తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం ఉప్పుగల్ గ్రామానికి చెందిన నాయిని కుమారస్వామి(57) అనే గీత కార్మికుడు కులవృత్తి లో భాగంగా రోజువారి లాగానే తాటి చెట్లను గీయడానికి సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి అక్కడికక్కడ మృతి చెందాడు.

అక్కడున్న గ్రామస్తులు మృతిని భార్య సుజాతకు సమాచారం అందించడంతో మృతుని భార్య వెళ్లి చూడగా అప్పటికే భర్త నాయన కుమారస్వామి మృతి చెందారు. మృతునికి ఇద్దరు కుమారులు,  కుమార్తె ఉన్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ మహేందర్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు