బిఆర్ఎస్ నే తెలంగాణ జనతాకో ధోకదియా ..

బిఆర్ఎస్ నే తెలంగాణ జనతాకో ధోకదియా ..

కేంద్రమంత్రి అర్జున్ ముండా ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: బిఆర్ఎస్ నే తెలంగాణ జనతాకో ధోకదియా(బిఆర్ఎస్ తెలంగాణ ప్రజలను) మోసగించిందని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి డాక్టర్ గుండె విజయ రామారావు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గురువారం రాత్రి స్థానిక శివాజీ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి అందించి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత మోడీది అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ఏ ఒక్కటి నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆ పార్టీని ఓడించాలన్నారు. స్థానిక అభ్యర్థి విజయ రామారావు గెలుపుతో మార్పు రావాలని రాష్ట్రంలో కమలం జెండా ఎగురవేసి కొత్త చరిత్ర రాయాలన్నారు. ఈ ప్రచార సభలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, అంజిరెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, బొజ్జపల్లి సుభాష్, యుగంధర్ రెడ్డి, పులి రవి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.