కాంగ్రెస్ గెలుపుకై పనిచేయాలి

కాంగ్రెస్ గెలుపుకై పనిచేయాలి
  • సింగపురం ఇందిర 

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర పిలుపునిచ్చారు.గురువారం డివిజన్ కేంద్రంలోని  పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమామావేశంలో ఇందిర మాట్లాడుతూ కేసిఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసుగుచెందారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం స్టేషన్ ఘన్‌పూర్ మండల ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు సింగపురం దయాకర్, జేఏసీ చైర్మన్ రహమతుల్లా, మండల బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు పెద్దపూండ్ర స్వాతి రెడ్డి ఇందిర సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరారు.