అనతి కాలంలోనే అద్భుత విజయాలు
![అనతి కాలంలోనే అద్భుత విజయాలు](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64db6ca2bc542.jpg)
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
- జిల్లాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
ముద్ర ప్రతినిధి, జనగామ: సీఎం కేసీఆర్ సమర్థవంతమైన పరిపాలనతో రాష్ట్రం అనతి కాలంలోనే అద్భుత విజయాలను సాధించిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మ కంచ స్టేడియంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందానాన్ని స్వీకరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ మనం స్వాతంత్య్రం సాధించుకుని 76 ఏళ్లు పూర్తయ్యిందన్నారు. ఉక్కు సంకల్పంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని చెప్పారు. కేసీఆర్ పాలనలో అనతి కాలంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని వివరించారు. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన్నారు.
జాతీయ స్థాయిలో మన రాష్ట్రం సాధించిన అవార్డులు సమర్థవంతంగా సాగుతున్న పరిపాలనకు గీటురాళ్లని అన్నారు. ఈ నేపథ్యంలో మన జిల్లాలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ సీతారాం, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోకల జమున లింగయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు.