ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ముద్ర ప్రతినిధి, జనగామ: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేశారు లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా ఆదివారం ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు జనగామ రైల్వే స్టేషన్ సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, కొన్నే మహేందర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసాన్ పల్లి లింగాజీ, జనగామ జిల్లా నాయకులు ఉడత రవి యాదవ్, అల్లం ప్రదీప్ రెడ్డి, పిట్టల సతీష్ పాల్గొన్నారు.