నిరుద్యోగుల ఉసురు తగులుద్ది .. టిపిసిసి సభ్యుడు అమృత రావు

నిరుద్యోగుల ఉసురు తగులుద్ది  .. టిపిసిసి సభ్యుడు అమృత రావు

 కాంగ్రెస్ ఆధ్వర్యంలో కెసిఆర్, కేటీఆర్ ల దిష్టిబొమ్మలు దహనం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: ఉద్యోగ ప్రకటనల పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుద్దని టిపిసి సభ్యుడు గంగారపు అమృతరా అన్నారు. గ్రూప్ 1 పేపర్ లీక్ ను నిరసిస్తూ జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు.

ప్రభుత్వ అండ దండలతోటే జూనియర్ లైన్మెన్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, గ్రూప్ 1, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇలా అన్ని పరీక్ష పేపర్లను లీక్ చేస్తున్న లీక్ వీరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింత ఎల్లయ్య, కిసాన్ సెల్ అధ్యక్షులు సింగపురం వెంకన్న, యువజన నాయకులు ఐలపాక శ్రీనివాస్, వసంత్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నలిమెల ఏలియా, గ్రామ శాఖ అధ్యక్షులు గట్టు కోటేశ్వర్, ఉపాధ్యక్షులు నక్క పాపయ్య, ప్రధాన కార్యదర్శి సింగపురం నాగయ్య, కోరుకొప్పుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.