అధికారంలోకి వస్తుంది...

అధికారంలోకి వస్తుంది...
  • గ్యారెంటీలను అమలు చేస్తుంది 
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందిర 

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్, నష్కల్ గ్రామాలలో గురువారం గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లింగాల సుభాష్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు గడ్డమీద సురేష్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు యాదవ రెడ్డి, మండల బీసీసీ అధ్యక్షులు బాలరాజు, పిఎసిఎస్ డైరెక్టర్ ఉమ్ల నాయక్, మహిళా అధ్యక్షురాలు గాజుల రజిని, మండల మహిళా అధ్యక్షురాలు శోభ, ఉపాధ్యక్షురాలు సుప్రియ ఎస్సీ సెల్  మండల అధ్యక్షులు కృష్ణ గ్రామ శాఖ అధ్యక్షులు రవి, గార్లగడ్డ అధ్యక్షులు రాజు మాజీ అధ్యక్షులు మదన్ నాయకులు బాలరాజు, తిరుపతి, మాజీ సర్పంచ్ రామ్ లాల్, వెంకట్రాం హుస్సేన్, అనిల్, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.