సోమన్న భక్తులు ఇబ్బంది పడొద్దు
![సోమన్న భక్తులు ఇబ్బంది పడొద్దు](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63e63b58e5f88.jpg)
ముద్ర ప్రతినిధి, జనగామ: పాలకుర్తి సోమేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ప్రపూల్ దేశాయ్ ఆఫీసర్లను ఆదేశించారు. ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఆలయంలో చేపడుతున్న సానిటేషన్, క్యూలైన్లు, వీధిలైట్లు, మరుగుదొడ్లు, అంతర్గత రోడ్లు, తాగునీరు, గార్డెనింగ్ ప్లాంటేషన్, సుందరీ కరణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్డీవో పీడీ జి.రామిరెడ్డి, డీపీవో వసంత, కాంట్రాక్టర్ నరసింహారెడ్డి, ఆలయ అధికారులు ఉన్నారు.