ప్రజలను ప్రలోభ పెట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్

ప్రజలను ప్రలోభ పెట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్
  • డబ్బులతో అధికారంలోకి రావాలని చూస్తున్నరు
  • పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ సమైక్యవాది
  • జనగామ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డబ్బు సంచులతో అధికారంలోకి రావాలని చూస్తున్నాయని, ఇక జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ సమైక్యవాది అని జనగామ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంత రెడ్డి ఆరోపించారు. శనివారం జనగామలోని దశమంత రెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణా వాది కాదని, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పోలీసులను తన ఇంట్లో పెట్టుకుని ఉద్యమం అణచాలని చూసిన సమైక్యవాది అని ఆరోపించారు. రెండు రోజు కింద జరిగిన ఓటింగ్‌లో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అధికార బీఆర్ఎస్‌కు అమ్ముడు పోయిన పోలీసులు ఓటింగ్ సమయంలో నిర్లక్ష్యంగా ఉండడం ఏమిటని..? ప్రశ్నించారు. రాజేశ్వర్ రెడ్డి పలు పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడి అలజడి సృష్టించారని, అతడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల  రమేశ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు శివరాజ్ యాదవ్, సౌడ రమేశ్‌, పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ, పట్టణ ప్రధాన కార్యదర్శిలు సంపత్ కుమార్, సందీప్, తోకల హరీష్ పాల్గొన్నారు.