ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలి
- మూడంచెల భద్రత నడుమ కౌంటింగ్
- జిల్లా వ్యప్తంగా 144 సెక్షన్ అమలు
- వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం
ముద్ర ప్రతినిధి, జనగామ :ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, మూడంచెల భద్రత నడుమ నేడు కౌంటింగ్ నిర్వహించనున్నట్టు వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన జనగామలో నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.
కౌంటింగ్ కేంద్రంలో వెళ్లే ఏజెంట్లను క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పింపిస్తారని తెలిపారు. ఒక బాల్ పెన్ను, వైట్ పేపర్ తప్ప మరేలాంటి వస్తువులు కౌంటింగ్ కేంద్రంలోని అనుమతించరని పేర్కొన్నారు. ఉదయం 7.30 గంటల వరకే ఏజెంట్లు లోనికి వెళ్లవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు ఉన్నందున రాజకీయ పార్టీలు ర్యాలీలు, మీంటింగ్లు నిర్వహించడం కుదరదన్నారు. అలాగే సంబురాల పేరుతో పటాకులు కాల్చినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. ఎన్నిలక నియామళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సమావేశంలో జనగామ సీఐ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.