నియోజకవర్గ అభివృద్ధే నా ఏజెండా.....

నియోజకవర్గ అభివృద్ధే నా ఏజెండా.....
  • అభివృద్ధి చేశాం...... ఓటు అడిగే హక్కు నాకే ఉంది
  • బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి

ముద్ర.జఫర్‌గడ్ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అభివృద్ధి నా ఎజెండా అని, అభివృద్ధి చేశాం ఓటు అడిగే హక్కు నాకే ఉందని బిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం ఎన్నికల్లో భాగంగా జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలోని కూనూరు, రఘునాథ్ పల్లి, ఉప్పుగల్, తమ్మడపల్లి(ఐ), తిమ్మంపేట్ గ్రామాలలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంగా ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. రైతులకు 24 గంటల కరెంటు , రైతు బీమా అందుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలతో . మోసపూరిత హామీలతో రైతుల మాగం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నమ్మకండి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్, జడ్పిటిసి బేబీ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్, రాజు. పిఎసిఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు , అన్నపు బ్రహ్మారెడ్డి, రాజేష్ నాయక్, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.