ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన జిపి కార్మికులు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన జిపి కార్మికులు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, జీవో నెంబర్ 51 రద్దుచేసి 60 అమలు చేయాలని గత 13 రోజులుగా సమ చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు రాష్ట్ర, జాతీయస్థాయిలో అవార్డులు తెచ్చేందుకు కారకులైన జిపి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గూడూరు భాస్కర్ కండోజు రాజు, బోసు రాజు, వెంకన్న, రావుల జగన్నాథం, సలీం, లక్ష్మి, బూలి, కోమల, యాదమ్మ, స్వరూప, పెంటమ్మ, సారయ్య, చిరంజీవి, శ్రీనివాస్, ఆనందం తోపాటు గ్రామపంచాయతీ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు.