‘స్టేషన్’ పై గులాబీ జెండా ఎగిరి తీరుతుంది
![‘స్టేషన్’ పై గులాబీ జెండా ఎగిరి తీరుతుంది](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f98ada439ba.jpg)
స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: తనకు వ్యక్తిగత ఎజెండా లేదని, అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం తన ఎజెండా అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, కుడా నుండి రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి రూ.65 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసం తో ఉన్నారని, ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం అన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని , అన్నీ కూడా త్వరలో సద్దుమణుగుతాయని అన్నారు. 2014, 2018 లో రెండు పర్యాయాలు రాజయ్యకు పార్టీ అవకాశం ఇచ్చిందని, ఆయన విజయానికి తాము కృషి చేశామని అన్నారు. తన విజయానికి కూడా సోదరుడు రాజయ్య సహకారం అందిస్తాడని నమ్ముతున్నానన్నారు. . ఇందుకోసం వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటానన్నారు.