మేము బీఆర్ఎస్ కే ఓటేస్తాం
![మేము బీఆర్ఎస్ కే ఓటేస్తాం](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f98fda461e0.jpg)
మెట్పల్లి, ముద్ర: కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు వేసి కల్వకుంట్ల సంజయ్ ను గెలిపిస్తామని పలు కుల సంఘాల సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం పట్టణంలోని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నివాసంలో మల్లాపూర్ మండలం చిట్టాపూర్, సంగెం శ్రీరాంపూర్, దాంరాజ్ పల్లి గ్రామాలకు చెందిన పలు కుల సంఘాల సభ్యులు, కాంగ్రెస్, బీజేపి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ లు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుల సంఘాల సభ్యులు సంజయ్ కు ఓటు వేస్తామని తీర్మానం చేసి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తో పాటు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చూసి పలు పార్టీలకు చెందిన నాయకులు, కుల సంఘాల సభ్యులు బీ ఆర్ ఎస్ పార్టీ లో చేరి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని అన్నారు.