గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి-జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ భాష 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాష తెలిపారు. సంబంధిత అధికారులతో కలెక్టరేట్ సముదాయంలో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 11 ఆదివారం రోజున ఉదయం 10:30 గంలనుండి. 1:00 వరకు నిర్వహించు గ్రూప్ -1 సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు జగిత్యాల జిల్లాలో 21 పరీక్షాకేంద్రాలలో 6885 మంది అభ్యర్థులు హాజరు అవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్ లో తెలిపిన తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ వారి నియమ నిభందనలను తప్పక పాటించాలని, ఎంపిక చేసిన పరీక్షాకేంద్రానికి రెండు గంటల ముందుగా ఉదయం  08:30 కు చేరుకొని పరీక్షకు హాజరుకావలని కొరారు. అభ్యర్థుల సమాచారం కోసం జగిత్యాల కలెక్టరు కార్యాలయము  హెల్ప్ లైన్ నెం. 18004257620 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.